రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు - TELANGANA CORONA CASES
![రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8707125-821-8707125-1599451936293.jpg)
09:09 September 07
రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 9 మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,42,771 మందికి వైరస్ సోకగా.. 895 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,635 యాక్టివ్ కేసులున్నాయి. 24,596 మంది ఐసోలాషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 1,10,241 మంది కరోనాను జయించారు.
జీహెచ్ఎంసీలో 245 మందికి కొత్తగా వైరస్ సోకగా.. రంగారెడ్డి జిల్లాలో 158, కరీంనగర్లో 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103 మంది వైరస్ బారినపడ్డారు.
ఇవీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..