తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్​ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం

ఐదేళ్లు అధికారంలో ఉన్న భాజపా హైదరాబాద్​కు చేసిందేమీలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. కేసీఆర్​ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయమేస్తోందని ప్రశ్నించారు. శేరిలింగంపల్లిలోని అల్విన్​ కాలనీలో నిర్వహించిన రోడ్​షోలో భాజపాపై ధ్వజమెత్తారు.

By

Published : Apr 7, 2019, 9:12 PM IST

శేరిలింగంపల్లిలోని ఆల్విన్​ కాలనీలో కేటీఆర్​ రోడ్​షో

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా హైదరాబాద్ నగరానికి చేసిందేమీలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్​ కాలనీలో నిర్వహించిన రోడ్​షోలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్​ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. వ్యక్తిగత కార్యక్రమాలను రాజకీయం చేసి భాజపా నేతలు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్​కు రోజు దేవుడు గుర్తుకు వస్తే, మోదీకి మాత్రం ఎన్నికలప్పుడే గుర్తుకోస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే భాజపా నేతలకు మసీద్, మందిర్ గుర్తుకొస్తాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం భారత్​-పాక్​ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ వేషం మారింది కానీ దేశం మారలేదన్నారు. చాయ్‌వాలా నుంచి ప్రమోషన్ పొందిన మోదీ ఇప్పుడు చౌకీదార్ అంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టేకేదార్ అంటున్నాడని ఎద్దేవా చేశారు.

శేరిలింగంపల్లిలోని అల్విన్​ కాలనీలో కేటీఆర్​ రోడ్​షో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details