ETV Bharat / city
ఓటర్లను ప్రలోభపెడితే చర్యలే: రజత్కుమార్
ఓట్ల పండుగకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుంది ఈసీ. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి
By
Published : Mar 19, 2019, 6:00 PM IST
| Updated : Mar 19, 2019, 11:02 PM IST
తొలిసారి సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక నిఘా
తొలిసారి సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక నిఘా నామపత్రాల దాఖలు నుంచే నూతన విధానాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రజత్ స్పష్టం చేశారు. సీవిజిల్ యాప్లో నమోదవుతున్న కేసులపై విచారణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించామని తెలిపారు. తొలిసారి సామాజిక మాధ్యమాల మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు.శాంతిభద్రతల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే డీజీపీతో చర్చించామన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల జరుగుతునందునబలగాల కేటాయింపు తక్కువగా ఉంటుందన్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణపై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... Last Updated : Mar 19, 2019, 11:02 PM IST