తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫాస్ట్‌ట్రాక్‌కోర్టుకు సమత హత్యాచార నిందితులు - JUSTICE fo SAMATA news

గతనెల 24న కుమురం భీం జిల్లాలో హత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది.  నిందితులు షేక్‌ బాబు, మఖ్దూం, షాబొద్దీన్‌లను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు తరలించారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమత కేసు నిందితుల విచారణ
ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమత కేసు నిందితుల విచారణ

By

Published : Dec 16, 2019, 12:13 PM IST

Updated : Dec 16, 2019, 1:05 PM IST

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమత కేసు నిందితుల విచారణ

సమత కేసులో నిందితులపై ఆదిలాబాద్​ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించే అవకాశముంది. మరోవైపు నిందితుల జ్యూడీషియల్‌ కస్టడీని పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...

Last Updated : Dec 16, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details