ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామంలో సామూహిక వివాాహాలు వైభవంగా జరిగాయి. తొమ్మిదో తేదీన 9 గంటల సమయాన తొమ్మిది జంటలు ఏకమయ్యాయి. పులాజిబాబా ధ్యాన మందిర్ ఆవరణలో ఆదివాసి ఆంద్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాశ్, జిల్లా అధ్యక్షుడు విష్ణు.. ఆంద్ సమాజం ఆధ్వర్యంలో వివాహాలను శనివారం ఘనంగా జరిపించారు.
జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీభాయి, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, మాజీ ఎంపీ రాఠోడ్ రమేశ్ ఈ వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.