ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలు.. ఉట్నూర్, జయనగర్, నార్నూర్, గాదిగూడతోపాటు పలు ప్రాంతాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్స్టేషన్లలో ఎస్సైలు, సీఐల ఆధ్వర్యంలో పోలీసులు ఆయుధపూజ చేశారు.
రాజాదేవ్సా వంశీయుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు - adilabad azency area dussehra celebrations
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రాజాదేవ్సా వంశస్థులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ రీతిలో వేడుకలు జరిపారు.
![రాజాదేవ్సా వంశీయుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు dussehra celebrations at adilabad azency area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9309750-295-9309750-1603634917875.jpg)
రాజాదేవ్సా వంశీయుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు
ఆదివారం సాయంత్రం ఉట్నూర్ మండల కేంద్రంలోని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక రామాలయం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రాజాదేవ్సా వంశస్థులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. డోలు వాయిద్యాల నడుమ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ