తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా.. కిషన్​ రెడ్డే: సోయం - కిషన్​ రెడ్డే మా ముఖ్యమంత్రి అంటూ సోయం బాపురావు వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రైనా... కేంద్రమంత్రైనా కిషన్​ రెడ్డేనని... ఎంపీ సోయం బాపురావు అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై ఆదిలాబాద్​లో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

adilabad mp soyam bapurao intresting comments on central minister kishan reddy
మాకు ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా.. కిషన్​ రెడ్డే: సోయం

By

Published : Dec 22, 2020, 10:10 PM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నా లేనట్లేనని... ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో... ఆదిలాబాద్​కు ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా... కిషన్​ రెడ్డే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని... కేసీఆర్​ వరంగల్​కు తరలించారని ఆరోపించారు. ప్రధానమంత్రితో మాట్లాడి ఉట్నూర్​లో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఎవరికీ రావడం లేదని... ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు.

ఇదీ చూడండి:'రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే నూతన సాగు చట్టాలు'

ABOUT THE AUTHOR

...view details