తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2023, 9:41 AM IST

Updated : Apr 4, 2023, 11:15 AM IST

ETV Bharat / business

'పిట్ట పోయి కుక్క వచ్చే'.. ట్విట్టర్​ లోగో మార్చిన ఎలాన్​ మస్క్

ట్విట్టర్​ కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో అనేక మార్పులు చేపడుతున్నారు సీఈఓ ఎలాన్​ మస్క్​. తాజాగా ట్విట్టర్​ లోగోను కూడా మార్చేశారు. ట్విట్టర్​ పిట్ట స్థానంలో కుక్క(డాగీ మీమ్​)ను తీసుకొచ్చారు. ఇంతకీ మస్క్​ ఇలా ఎందుకు చేశారంటే..

Musk replaces Twitters blue bird logo with Doge meme
Musk replaces Twitters blue bird logo with Doge meme

ట్విట్టర్​ను​ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి.. మైక్రో బ్లాగింగ్​ సైట్లో అనేక మార్పులు చేస్తున్నారు సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్​. తాజాగా ట్విట్టర్​ లోగోను మార్చుతూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్​ పిట్ట స్థానంలో కుక్క(డోజ్ మీమ్​)ను లోగోగా అప్డేట్​​ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్​ వెబ్​ వర్షన్​లో కొత్త లోగో కనిపిస్తోంది. 2013లో ఈ డోజ్ మీమ్​ను ఫన్నీగా క్రియేట్​ చేశారు. ఈ డోజ్ మీమ్​.. డోజ్​కాయిన్​ అనే క్రిప్టో కరెన్సీ లోగోలో కూడా ఓ భాగంగా ఉంది. అయితే, బిట్​కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలకు పోటీగా డోజ్​కాయిన్​ ఈ ఫన్నీ లోగోను క్రియేట్​ చేసింది. ట్విట్టర్​​ లోగో మార్చిన తర్వాత డోజ్​కాయిన్​ విలువ 20 శాతానికి పైగా పెరిగింది.

కొత్త లోగో మార్చిన సందర్భంగా ఓ ఫన్నీ ఫోటో కూడా ట్వీట్​ చేశారు. అందులో డోజ్ కారులో వెళ్తుండగా.. ట్రాఫిక్​ పోలీస్​ లైసెన్స్​ అడుగుతాడు. ట్విట్టర్​ పిట్ట ఉన్న కార్డు ఇస్తుంది డోజ్. ఫొటో తేడాగా ఉంది అని పోలీస్​ అడగగా.. అది పాత ఫోటో అని సమాధానమిస్తుంది డోజ్. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఈ పోస్టుతో పాటు మరో ఫొటోను కూడా ట్వీట్ చేశారు మస్క్​. అందులో గతేడాది 'కొత్త ప్లాట్​ఫామ్​ అవసరమా' అని అడిగారు మస్క్​. దీనికి ఛైర్మన్​​ అనే యూజర్​.. 'ట్విటర్​ను కొనుగోలు చేసి.. లోగోగా డోజ్​ ఫొటోను మార్చండి' అని బదులిచ్చాడు. తాజాగా ఈ ఫొటోకు 'హామీ నెరవేర్చాను​' అని రాసుకొచ్చారు.

ఎలాన్ మస్క్​ ట్వీట్​ చేసిన ఫొటో
ఎలాన్ మస్క్​ ట్వీట్​ చేసిన ఫొటో

మస్క్​.. ఏందుకిలా చేశారంటే..
ఎలాన్ మస్క్​ ఇలా ఎందు చేశారో అర్థం కావడం లేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాన్​ మస్క్​కు డోజ్​ మీమ్​ అంటే చాలా ఇష్టమని అంటున్నారు. ఈ డోజ్​ మీమ్​ను ఓ సందర్భంలో మస్క్​ వాడారు. ఇంతకుముందు ఫిబ్రవరిలో ట్విట్టర్​ సీఈఓ స్థానంలో డోజ్​ ఉన్న ఫొటోను ట్వీట్ చేసి.. కొత్త సీఈఓ వచ్చారంటూ రాసుకొచ్చారు. మరోవైపు, ఏప్రిల్​ ఫూల్​ చేయడానికి.. ఏప్రిల్​ 1న విడుదల చేయాల్సిన కొత్త లోగో.. ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు విడుదల చేశారా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా, డోజ్​కాయిన్​ క్రిప్టోకరెన్సీని మస్క్​ చాలా రోజులుగా ప్రమోట్​ చేస్తున్నారు. 2021లో 'సాటర్​డే నైట్​ లైవ్​' షో డోజ్​ కాయిన్​ గురించి ప్రస్తావించగా.. దాని వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల.. డోజ్​కాయిన్​ విలువ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చాలా మంది రిటైల్​ ఇన్వెస్టర్లు నష్టపోయారు. వారందరూ.. ఎలాన్​ మస్క్​పై 258 బిలియన్​ డాలర్ల దావా వేశారు. దీని నుంచి బయటపడడానికే మస్క్​ తాజాగా డోజ్​ లోగో నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్​ వెబ్​ వర్షన్​లో మారిన డోజ్​ లోగో
Last Updated : Apr 4, 2023, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details