తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా మూడో సెషన్​లోనూ జోష్​- సెన్సెక్స్​ 712 పాయింట్లు ప్లస్ - స్టాక్​ మార్కెట్ క్లోజింగ్

Stock Market today : స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 712 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 229 పాయింట్లు వృద్ధి చెందింది.

Stock Market today
స్టాక్ మార్కెట్

By

Published : Jul 29, 2022, 3:44 PM IST

Updated : Jul 29, 2022, 4:55 PM IST

Stock Market today: అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 712 పాయింట్లు పెరిగి 57,570 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ ఉదయం 17,079.50 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 17,170కు చేరిన సూచీ.. చివరకు 229 పాయింట్లు ఎగబాకి 17,158కి చేరింది.

లాభనష్టాల్లోనివి: ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్​, టాటా స్టీల్​, హిందాల్కో, సన్​ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ షేర్లు లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్​ ల్యాబ్స్, కొటాక్​ మహీంద్ర, ఎస్​బీఐ, దివీస్​ ల్యాబ్స్​, యాక్సిక్​ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

45 పైసలు పెరిగిన రూపాయి విలువ:అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 45 పైసలు పెరిగింది. దీంతో 79.24 వద్ద స్థిరపడింది.

ఇవీ చదవండి:పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లలో లాభాల జోరు

'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!

Last Updated : Jul 29, 2022, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details