తెలంగాణ

telangana

RBI To Reintroduce 1000 Currency Notes : రూ.1000 నోటు రీఎంట్రీపై.. రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

RBI To Reintroduce 1000 Currency Notes In Telugu : కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.1000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి తప్పించింది. అయితే వీటిని మళ్లీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్​బీఐ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి తాము రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించడం లేదని స్పష్టం చేసింది.

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 1:13 PM IST

Published : Oct 20, 2023, 1:13 PM IST

Updated : Oct 20, 2023, 2:02 PM IST

ETV Bharat / business

RBI To Reintroduce 1000 Currency Notes : రూ.1000 నోటు రీఎంట్రీపై.. రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

Rs 1000 Notes Coming Back
RBI To Reintroduce 1000 Currency Notes

RBI To Reintroduce 1000 Currency Notes : ప్రస్తుతానికి రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ తాము చేయడం లేదని ఆర్​బీఐ స్పష్టం చేసింది. రూ.1000 నోట్లను మళ్లీ రీఇంట్రడ్యూస్​ చేస్తారనే వార్తలు.. పూర్తిగా ఊహాజనితం అని పేర్కొంది.

ఊహాజనితం
కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తరువాత.. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెడతారనే ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. అయితే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఊహాజనితమే అని పేర్కొంది.

రూ.500, రూ.1000 డీమోనటైజేషన్​
కేంద్ర ప్రభుత్వం 2016 నంబర్​లో అకస్మాత్తుగా రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేసింది. అంటే డీమోనటైజేషన్ చేసింది. దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద తమ భారీగా బారులు తీరారు.

రూ.2000 నోట్ల ఉపసంహరణ
గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్​బీఐ రూ.2000 నోట్ల చలామణిని ఉపసంహరించుకున్న తరువాత.. వాటిని మార్చుకోడానికి లేదా డిపాజిట్ చేయడానికి మొదటిగా సెప్టెంబర్​ 30 వరకు గడువు ఇచ్చింది. తరువాత ఈ గడువును మరో వారం పాటు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు కూడా ముగిసింది. కానీ ఇంకా ఎవరి దగ్గరైనా రూ.2000 నోట్లు ఉంటే.. వాటిని ఆర్​బీఐ ఇష్యూ ఆఫీస్​ల వద్ద డిపాజిట్​ చేసుకునే అవకాశం ఇచ్చింది.

సర్క్యులేషన్​లో ఎన్ని ఉన్నాయంటే..
వాస్తవానికి ఆర్​బీఐ 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. రూ.2000 నోట్ల చలామణిని నిలుపుదల చేసిన తరువాత.. ఇప్పటి వరకు 3.43 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. వీటిలో 87 శాతం వరకు బ్యాంకు డిపాజిట్లు ద్వారా, మిగిలిన 9 శాతం నోట్ల మార్పిడి ద్వారా జమ అయ్యాయి. ఇప్పుడు కేవలం రూ.12,000 కోట్లు (3.37%) విలువైన నోట్లు మాత్రమే సర్క్యులేషన్​లో ఉన్నాయి.

Elon Musk Wealth Shrinks : టెస్లా షేర్ల పతనంతో.. ఒక్క రోజులోనే మస్క్ సంపదలో రూ.1.30 లక్షల కోట్లు ఆవిరి!

How to Check FASTag Balance : దసరా జర్నీలో అలర్ట్.. ఒక్క మిస్డ్​ కాల్​తో.. ఫాస్ట్​ట్యాగ్ బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి..!

Last Updated : Oct 20, 2023, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details