Jio Fiber Entertainment Bonanza : క్రేజీ ఆఫర్స్.. హై స్పీడ్ ఇంటర్నెట్.. గ్రామాల్లోనూ ఫుల్ నెట్వర్క్.. ఆకర్షించే రీఛార్జ్ ప్లానింగ్లతో జియో కస్టమర్ల మనసు దోచేస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్బాండ్ సేవలను విస్తరించేందుకు రెడీ అవుతోంది. దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్బాండ్గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో ఫైబర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాలను చేరుకుంది.
28 నగరాల్లో.. తెలంగాణలో 28 నగరాలు, పట్టణాలకు జియో ఫైబర్ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ మాత్రమే గాకుండా ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్నగర్, శంకర్పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్లలో కస్టమర్లకు చేరువైంది. త్వరలో మరో 7 పట్టణాలకు తన సేవలను విస్తరించనుంది.
ఏపీలో 43 ప్రాంతాల్లో.. ఆంధ్రప్రదేశ్లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో పటిష్ఠ ఉనికితో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులలో కూడా జియో ఫైబర్ లభ్యమవుతోంది.