తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2023, 10:39 AM IST

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధరలు ఏంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold price today
10 గ్రాముల బంగారం రేటు ఎంత

Gold Rate Today: దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.500పెరిగి.. ప్రస్తుతం రూ.57,300వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1000 అధికమై.. ప్రస్తుతం రూ.71,500కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,300గా ఉంది. కిలో వెండి ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,500గా ఉంది.
  • Gold price in Visakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,500గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1842 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.36 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,73,690 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,73,690
ఇథీరియం రూ.1,00,437
టెథర్​ రూ.82.66
బైనాన్స్​ కాయిన్​ రూ.20,309
యూఎస్​డీ కాయిన్ రూ.82.71

మార్కెట్లు డీలా...
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 152 పాయింట్ల నష్టంతో 61,015 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం ఊగిసలాట మధ్య కొనసాగుతోంది. 45 పాయింట్లు కోల్పోయి 18,151 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, రిలయన్స్, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details