హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే? - పెట్రోల్ ధరలు
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?
gold rate today
By
Published : Apr 2, 2023, 11:45 AM IST
|
Updated : Apr 2, 2023, 11:56 AM IST
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.61,275గా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.73,830 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.61,275 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,830 రూపాయలుగా ఉంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,275గా ఉంది. కిలో వెండి ధర రూ.73,830 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vishakhapatnam: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,275 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,830గా ఉంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,275గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,830 వద్ద ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,969.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.13 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ ధర రూ.22,91,870 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్కాయిన్
రూ.22,91,870
ఇథీరియం
రూ.1,41,015
టెథర్
రూ.82.19
బైనాన్స్ కాయిన్
రూ.25,429
యూఎస్డీ కాయిన్
రూ.82.17
కొత్త హాల్మార్క్ కోడ్..
ఏప్రిల్ 1 నుంచి బంగారానికి సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వచ్చేశాయి. బంగారంపై మరో ధ్రువీకరణ మార్క్ తప్పనిసరైంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు డిజిట్ల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి.
గోల్డ్ హాల్మార్కింగ్ అంటే ఏంటి? HUID కోడ్ ఎలా గుర్తించాలి..
గోల్డ్ హాల్మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు ఇచ్చే ధ్రువీకరణ.
బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందనే విషయాన్ని ఆ ఆభరణంపై కోడ్ రూపంలో ముద్రిస్తారు. 2021 జూన్ 16 వరకు ఈ పద్ధతిని స్వచ్ఛందంగా అమలు చేశారు.
ఆభరణ తయారీదారులు తమ ఇష్టపూర్వకంగా హాల్మార్క్ వేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత హాల్మార్కింగ్ను తప్పనిసరి చేశారు.
ఈ విధానం విజయవంతంగా అమలైందని కేంద్రం వెల్లడించింది. స్వల్ప కాలంలోనే రెండు కోట్లకు పైగా బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ముద్ర పడిందని తెలిపింది. లక్షకు పైగా స్వర్ణకారులు దీనికి రిజిస్టర్ అయ్యారని, రోజుకు మూడు లక్షలకు పైగా ఆభరణాలు హాల్ మార్క్ ధ్రువీకరణ పొందుతున్నాయని వివరించింది.