Gold Rate Today 22nd August 2023 :దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,019గా ఉండగా.. మంగళవారం నాటికి రూ.7 పెరిగి రూ.60,026కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.72,610గా ఉండగా.. మంగళవారం రూ.1,280 పెరిగి రూ.73,890కు చేరింది.
- Gold Price In Hyderabad 22nd August 2023 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.60,026గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,890గా ఉంది.
- Gold Price In Vijayawada 22nd August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,026గా ఉంది. కిలో వెండి ధర రూ.73,890కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 22nd August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,026గా ఉంది. కిలో వెండి ధర రూ.73,890గా ఉంది.
- Gold Price In Proddatur 22nd August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,026గా ఉంది. కిలో వెండి ధర రూ.73,890కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 22nd August 2023 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1892 డాలర్లుగా ఉండగా.. మంగళవారం ధర 1897 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.30 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 22nd August 2023 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ ధర రూ.21,63,861 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్కాయిన్ | రూ.21,63,861 |
ఇథీరియం | రూ.1,38,226 |
టెథర్ | రూ.83.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,453 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.8 |
స్టాక్మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 22nd August 2023 :అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 21.20 పాయింట్లు లాభపడి 65,237 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 5.60 పాయింట్ల లాభంతో 19,399 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
ఐటీసీ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.