తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లలో లాభాల జోరు

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ. 53,160 వద్ద ఉంది. మరోవైపు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మరో మూడో సెషన్​లో సానుకూలంగా కదలాడుతున్నాయి.

By

Published : Jul 29, 2022, 11:53 AM IST

gold price today
బంగారం ధర

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి.. ప్రస్తుతం రూ.53,160 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2000 మేర పెరిగి.. రూ.59,450 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,160 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,450గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,160 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,160 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,450వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,764 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.16 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. ప్రస్తుతం 79.44 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ఒక బిట్​కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.19,46,998 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.19,46,998
ఇథీరియం రూ.1,39,887
టెథర్ రూ.81.89
బినాన్స్​ కాయిన్ రూ.22,514
యూఎస్​డీ కాయిన్ రూ.82.45

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ దాదాపు 490 పాయింట్లు పెరిగి.. 57,350 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 165 పాయింట్లకుపైగా ఎగబాకి.. 17,100 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ ​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర లాభాల్లో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్​, ఐటీసీ, ఎస్​బీఐ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!

మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్​.. అపోలో నుంచి నలుగురు!

ABOUT THE AUTHOR

...view details