తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన క్రిప్టో.. నేటి లెక్కలు ఇలా

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52,740కు చేరింది. కిలో వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది. మరోవైపు క్రిప్టోకరెన్సీల్లో బిట్​కాయిన్​ భారీ నష్టాలను నమోదు చేసింది.

By

Published : May 27, 2022, 11:31 AM IST

బంగారం
బంగారం

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. గురువారం 52,540 వద్ద ఉన్న బంగారం ధర.. రూ. 200 పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,740కి చేరింది. కిలో వెండి ధర రూ.650 పెరిగి.. ప్రస్తుతం రూ.63,803 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,740గా ఉంది. కిలో వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,803గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,803 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 1,853 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.09 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Stock Market Updates:గురువారం సెషన్​లో లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు.. శుక్రవారం సెషన్​లో కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 225 పాయింట్లు పెరిగి.. 54 వేల 478 వద్ద సెషన్​ను కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో.. 16 వేల 237కు చేరింది. హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​, టీసీఎస్​ షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఆయిల్​ అండ్​ గ్యాస్​ మినహా ఇతర అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

Cryptocurrency Price in India:క్రిప్టోకరెన్సీల్లో..బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే రూ.46,576 పతనమైంది. ప్రస్తుతం రూ. 22,29,641 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,29,641
ఇథీరియం రూ.1,33,691
టెథర్ రూ.82.94
బినాన్స్​ కాయిన్ రూ.23,028
యూఎస్​డీ కాయిన్ రూ.82.78

ఇదీ చూడండి :ట్విట్టర్​తో 'డోర్సే' కటీఫ్​.. మస్క్​కు తేల్చిచెప్పిన మాజీ సీఈఓ!

ABOUT THE AUTHOR

...view details