తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - stock market

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

gold rates today
బంగారం ధరలు

By

Published : Jul 21, 2022, 10:41 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.300 తగ్గి.. ప్రస్తుతం రూ.51,840 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.450 తగ్గి తగ్గి.. రూ.56,300 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,840గా ఉంది. కిలో వెండి ధర రూ.56,300వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,840 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,300గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,692 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.63 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,61,990పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.18,61,990
ఇథీరియం రూ.1,21,997
టెథర్ రూ.81.90
బినాన్స్​ కాయిన్ రూ.20,799
యూఎస్​డీ కాయిన్ రూ.82.70

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 126 పాయింట్ల లాభంతో.. 55,535 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 41 పాయింట్లు ఎగబాకి.. 16,562 వద్ద కొనసాగుతోంది. ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్ నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

ABOUT THE AUTHOR

...view details