Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.190 పెరిగింది. ప్రస్తుతం రూ.52,790 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.50 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.63,850 ఎగువన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,790గా ఉంది. కిలో వెండి ధర రూ.63,853 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,853గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,853 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,853 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1855 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.11 డాలర్లుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు తగ్గి రూ. 77.78కి చేరింది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.