తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడే '5జీ' రెడ్​మీ కే30 విడుదల - చైనా

షియోమీ నుంచి డ్యూయల్​ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా, డ్యూయల్​ మోడ్​ 5జీతో కొత్త ఫోన్​లు నేడు చైనా మార్కెట్లోకి రానున్నాయి. ఈ కే30 ఫోన్ ఫీచర్స్​, భారత్​లో విడుదలయ్యే తేదీ వివరాలు మీ కోసం.

Xiaomi Redmi K30 Launching Tomorrow: MIUI 11, 20MP Selfie Camera and More Details Confirmed
నేడే '5జీ' రెడ్​మీ కే30 విడుదల

By

Published : Dec 10, 2019, 6:11 AM IST

గ్యాడ్జెట్​ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్​మీ కే30 స్మార్ట్​ఫోన్​ను నేడు చైనాలో విడుదల చేయనుంది షియోమీ సంస్థ. గతంలో ఈ ఫోన్​ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగానే.. రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్​ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్​ 5జీ సపోర్ట్​తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

ఫీచర్స్​...

  • 5జీ, 4జీ నెట్​వర్క్​ వేరియంట్లు
  • ఎమ్​ఐయూఐ 11- అండ్రాయిడ్​ 10
  • 512జీబీ స్టోరేజ్​
  • 12జీబీ ర్యామ్​
  • 20 ఎంపీ ఫ్రంట్​ కెమెరా
  • 3.5 ఎమ్​ఎమ్​ హెడ్​ఫోన్​ జాక్
  • డ్యూయల్​ ఫ్రీక్వెన్సీ జీపీఎస్​
  • మూడు రంగులు

డ్యూయల్ మోడ్​ 5జీ అంటే?

5జీ నెట్​వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్​, జపాన్​ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్​వర్క్​ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. దీన్ని 5జీ నాన్​ స్టాండ్​ అలోన్​ యాక్సెస్​ (5జీ ఎన్​ఎస్​ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్​వర్క్​ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్​ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్​వర్క్​లను వాడేందుకు వీలుగా రెడ్​మీ కే30 మోడల్​ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

భారత్​కు రెడ్​మీ కే30?

ఈ ఫోన్​ భారత్​లో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే భారత్​లో ఇప్పటి వరకు 5జీ నెట్​వర్క్​ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్​మీ కే30 4జీ వేరియంట్​ను భారత్​లో విడుదల చేసే అవకాశమున్నట్లు పలు టెక్​ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details