అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 422 పాయింట్లు క్షీణించి 38,072 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 11,192 గా స్థిరపడింది.
అమెరికా ఫెడరల్ బ్యాంకు త్వరలో ద్రవ్యపరపతి విధానం ప్రకటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే దేశీయ మార్కెట్లు నష్టపోయాయి.