తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల ఊతంతో భారీ లాభాల్లో సూచీలు

By

Published : Oct 8, 2020, 9:17 AM IST

Updated : Oct 8, 2020, 12:00 PM IST

STOCK MARKETS LIVE
స్టాక్​మార్కెట్లలో జోష్​-40 వేల మార్కు దాటిన సెన్సెక్స్​

11:25 October 08

భారీ లాభాల్లో మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 550, నిఫ్టీ 148 పాయింట్లు పెరిగాయి. ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. 

09:50 October 08

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 480 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 361 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో.. 11 వేల 870 వద్ద ఉంది. 

ఐటీ షేర్లు 4 శాతానికిపైగా పెరిగాయి.

విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా షేర్లు రాణించాయి. 

గెయిల్​, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, టైటాన్​, ఏషియన్​ పెయింట్స్​ నష్టపోయాయి. 

టీసీఎస్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండటం.. కంపెనీ బైబ్యాక్‌ ప్రకటించడం మార్కెట్లో ఉత్సాహం నింపింది. 368 కంపెనీలకు మార్కెట్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ విధానంలో మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నేడు ఏడు కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.  

08:53 October 08

స్టాక్​మార్కెట్లలో జోష్​-40 వేల మార్కు దాటిన సెన్సెక్స్​

స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలోనే 300 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 40 వేల 200 మార్కు ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 11 వేల 835 వద్దకు చేరింది.

ఐటీ, బ్యాంకింగ్​ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. 

Last Updated : Oct 8, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details