ఎస్ బ్యాంక్ వాటాలపై తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 39 వేల 170 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 11వేల 670వద్ద ట్రేడవుతోంది.
కారణాలివే...
దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఉత్సాహం నింపకపోవడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నష్టాలకు కారణం.
లాభనష్టాల్లో...
తొలి త్రైమాసికంలో లాభం భారీగా తగ్గిపోయినట్లు ఎస్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ వాటాలు 10శాతానికిపైగా నష్టపోయాయి.