తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక రంగ షేర్ల దూకుడుతో మార్కెట్లకు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్లు వృద్ధి చెంది 34,911 వద్ద, ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 10,311 వద్ద స్థిరపడ్డాయి.

By

Published : Jun 22, 2020, 3:45 PM IST

Updated : Jun 22, 2020, 4:35 PM IST

stock markets
విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ విపణిలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఆర్థిక రంగ షేర్లు సానుకూల ప్రభావం చూపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగియగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్లు పెరిగి 10,311 వద్ద స్థిరపడింది. మిడ్​ సెషన్​లో 35వేల మార్కును దాటిన సెన్సెక్స్ గరిష్ఠంగా 35,206ను తాకింది.

లాభనష్టాల్లో..

బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, నెస్లే షేర్లు లాభాలతో ముగిశాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్​జీసీ, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

రూపాయి విలువ..

డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు బలపడి రూ. 76కు చేరింది.

ముడిచమురు..

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 0.28 శాతం క్షీణించి 42.07 డాలర్లకు చేరింది.

ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడండి:ఈ-కామర్స్‌ ప్రపంచాన్ని 'ఫ్లిప్' చేసి 'కార్టు'లో వేసిన ఆలోచన...

Last Updated : Jun 22, 2020, 4:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details