తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 9:35 AM IST

Updated : Apr 16, 2021, 3:56 PM IST

ETV Bharat / business

మూడో రోజూ లాభాలు- రాణించిన ఫార్మా, ఎఫ్​ఎంసీజీ

bse updates, nse live updates
ఒడిదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

15:41 April 16

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 28 పాయింట్ల లాభంతో 48,832 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 36 పాయింట్లు బలపడి 14,617 వద్ద ముగిసింది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్​.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్​ సిమెంట్, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, నెస్లే షేర్లు లాభాలతో ముగిశాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎల్​&టీ, టీసీఎస్​, ఇన్ఫోసిస్, ఆర్​ఐఎల్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

11:32 April 16

అంతర్జాతీయంగా మిశ్రమ పవనాల నడుమ దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 180 పాయింట్లకుపైగా ఎగబాకి 48,984 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు లాభాపడి 14,670 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లో..

  • ఎం అండ్​ ఎం, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఏషియన్​ పెయింట్స్​, పవర్​ గ్రిడ్​, హెచ్​సీఎల్​ టెక్​, ఓఎన్​జీసీ, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, టీసీఎస్​, హిందుస్థాన్​ యూనీలివర్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:03 April 16

సానుకూలంగా వారాంతపు సెషన్​

వారాంతపు సెషన్​ను స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం బీఎస్​ఈ- సెన్సెక్స్​ 170 పాయింట్లకుపైగా బలపడి 48,978 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 14,647 వద్ద ట్రేడవుతోంది.   

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్​​ పెయింట్స్​, హెచ్​సీఎల్​టెక్​, బజాజ్​ ఫిన్సర్వ్​, ఎం అండ్​ ఎం, హెచ్​యూఎల్​​, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రిలయన్స్​, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, కోటక్​ బ్యాంక్ , ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేరడవుతున్నాయి.

Last Updated : Apr 16, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details