తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 4:07 PM IST

Updated : Jan 7, 2020, 4:24 PM IST

ETV Bharat / business

కాస్త తగ్గిన  భయాలు... మార్కెట్లకు లాభాలు

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గనున్నాయన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 12 వేల మార్కుకు ఎగువన ముగిసింది.

Sensex rebounds 193 pts; Nifty reclaims 12K
లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గనున్నాయన్న అంచనాల మధ్య స్టాక్​ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇరాన్ సాంస్కృతిక ప్రదేశాలపైనా దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పెంటగాన్ ఖండించిన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఓ దశలో 553 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... చివరకు 193 పాయింట్లు లాభపడి 40,869.47 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం 60 పాయింట్లు ఎగబాకి 12,052.95 వద్ద స్థిరపడింది.

అయితే 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది.

లాభాల్లోని షేర్లు

సెన్సెక్స్​ షేర్లలో అల్ట్రాటెక్​ సిమెంట్​ అత్యధికంగా 2.10 శాతం వృద్ధి చెందింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఏషియన్​ పెయింట్స్​ లాభాలు గడించాయి.

నష్టాల్లోని షేర్లు

ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ముడి చమురు

ముడి చమురు ధరలు సైతం 0.26 శాతం తగ్గి 68.73 అమెరికా డాలర్లకు చేరింది.

రూపాయి మారకం

అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరిగింది. డాలర్​పై 10 పైసలు బలపడి 71.83కి చేరింది.

ఆసియా మార్కెట్లు

మరోవైపు అంతర్జాతీయంగా వీచిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు సైతం భారీ లాభాలు ఆర్జించాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి.

Last Updated : Jan 7, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details