అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సూచనలు ఫలితంగా దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వాహనరంగం, బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్లతో ఈక్విటీ బెంచ్మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.84 పాయింట్లు లాభపడి 37 వేల 863 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 49 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 238 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఎమ్ అండ్ ఎమ్, వేదాంత లిమిటెడ్, సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి (సుమారు 1.54 శాతం) లాభాలతో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో
హెచ్యూఎల్, ఐటీసీ, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంకు, హీరో మోటోకార్ప్ (0.66 శాతం) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సానుకూల పవనాలు