తెలంగాణ

telangana

ETV Bharat / business

దీపావళికి ముందు స్తబ్దుగా ముగిసిన మార్కెట్లు - స్టాక్​ మార్కెట్లు వార్తలు

దీపావళికి ముందు అత్యల్ప లాభాలతో ముగిశాయి స్టాక్​మార్కెట్లు. బ్యాంకింగ్ రంగంలో లాభాల కారణంగా... నష్టాల నుంచి గట్టెక్కాయి. సెన్సెక్స్​ 37 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 1.3 పాయింట్లు మెరుగుపడింది.

BIZ-STOCKS-CLOSE

By

Published : Oct 25, 2019, 4:17 PM IST

దేశీయ మిశ్రమ పరిస్థితుల కారణంగా స్టాక్​ మార్కెట్లు శుక్రవారం స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్​ 37 పాయింట్లు లాభపడి 39,058 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.3 పాయింట్లు మెరుగై 11,583 వద్ద స్థిరపడింది.

ఒకానొక దశలో భారీగా నష్టపోయిన సూచీలు బ్యాంకింగ్ రంగం వృద్ధితో గట్టెక్కాయి. సెన్సెక్స్​ 573 పాయింట్ల మేర పడిపోయి 38,718కు చేరుకుంది.

లాభనష్టాల్లో..

ఎస్​ బ్యాంక్​, ఎస్బీఐ 7 శాతానికిపైగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్, మారుతీ, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్ 3.18 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్, వేదాంత, హెచ్​డీఎఫ్​సీ కొటక్​ బ్యాంక్, హీరోమోటోకార్ప్, ఎన్టీపీసీ 4.87 శాతం మేర నష్టపోయాయి.

ఆసియాలో మిశ్రమ ఫలితాలు నమోదవగా.. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details