తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: వారాంతంలో లాభాలు- సెన్సెక్స్ 308 ప్లస్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) 308 పాయింట్లు పెరిగి.. 51,400 పైకి చేరింది. నిఫ్టీ (Nifty) 98 పాయింట్లు బలపడి.. 15,400 పైన స్థిరపడింది.

Share market Updates Telugu
స్టాక్ మార్కెట్ వార్తలు తెలుగు

By

Published : May 28, 2021, 3:49 PM IST

స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 308 పాయింట్లు పెరిగి 51,423 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 98 పాయింట్ల లాభంతో 15,436 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,529 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,258 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,469 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,394 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.

సన్​ఫార్మా, బజాజ్ ఫిన్​సర్వ్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్​ సూచీలు లాభాలతో ముగిశాయి.

ఇదీ చదవండి:inflation: కరోనా వేళ.. ద్రవ్యోల్బణానికి రెక్కలు

ABOUT THE AUTHOR

...view details