తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల దూకుడు.. జీవితకాల గరిష్ఠానికి సూచీలు

ఐటీ రంగ షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 41,860కి చేరింది. నిఫ్టీ సైతం 73 పాయింట్ల వృద్ధితో 12,330 వద్ద స్థిరపడింది.

By

Published : Jan 13, 2020, 4:05 PM IST

Updated : Jan 13, 2020, 4:26 PM IST

Sensex jumps 259.97 pts to end at fresh lifetime high of 41,859.69; Nifty rises 72.75 pts to record 12,329.55. PTI  ANS
రాణించిన ఐటీ షేర్లు-లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పరిస్థితులకు తోడు ఇన్ఫోసిస్ ముడో త్రైమాసిక ఫలితాల ప్రభావంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. ఐటీ షేర్లు రాణించడం వల్ల సెన్సెక్స్​, నిఫ్టీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. మూడు నెలల క్షీణత అనంతరం 2019 నవంబర్​లో పారిశ్రామిక ఉత్పత్తి 1.8 శాతం మేర వృద్ధి చేయడం కూడా మార్కెట్లలో సానుకూల ప్రభావం చూపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 260 పాయింట్లు వృద్ధి చెంది 41,860 పాయింట్ల సరికొత్త శిఖరాల వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12,330 వద్ద గరిష్ఠ స్థాయి వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి

ఇన్ఫోసిస్ భారీగా లాభపడింది. నేటి ట్రేడింగ్​లో సుమారు 4.76 శాతం మేర లాభాలను గడించింది. శుక్రవారం సంస్థ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు మార్కెట్లలో జోరు నింపాయి. ఇండస్​ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, హెచ్​యూఎల్, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, పవర్​గ్రిడ్, టెక్​ మహీంద్ర షేర్లు లాభాల్లో ముగిశాయి.

టీసీఎస్, ఎస్​బీఐ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

రూపాయి

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే 12 పైసలు వృద్ధి చెంది రూ. 70.82కి చేరింది.

ముడి చమురు

ముడి చమురు ధర 0.37 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 65.22 డాలర్లుగా ఉంది.

ఇతర మార్కెట్లు

ఆసియా మార్కెట్లు సైతం గణనీయమైన లాభాలను ఆర్జించాయి. షాంఘై, హాంకాంగ్, సియోల్ స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయిలో వృద్ధి చెందాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

Last Updated : Jan 13, 2020, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details