తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​ టుడే: మాంద్యం భయాలతో మదుపర్లు అప్రమత్తం - stock live news

stock
stock

By

Published : Nov 29, 2019, 9:51 AM IST

Updated : Nov 29, 2019, 10:10 AM IST

10:06 November 29

వరుసగా లాభాల్లో కొనసాగిన స్టాక్​ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ప్రారంభమయ్యాయి. 220 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్​ 40,910 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 57 పాయింట్లు కోల్పోయి 12,093కు చేరుకుంది. 

మాంద్యం భయాలతో..

రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాల విడుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రెండో త్రైమాసికంలో జీడీపీ రేటు 4.2 నుంచి 4.7 శాతం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మొదటి త్రైమాసికం కన్నా తక్కువ. 

లాభనష్టాల్లో..

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నా.. 4 శాతం వృద్ధితో ఎస్​ బ్యాంక్​ లాభాల్లో ఉంది. భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, టెక్​ మహింద్రా, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంక్​ లాభపడ్డాయి. 

టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​ నష్టాల్లో సాగుతున్నాయి. 

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లూ నష్టాల్లోనే ఉన్నాయి. హాంకాంగ్​ విషయంలో అమెరికా జోక్యం కారణంగా షాంఘై, హాంకాంగ్​, దక్షిణ కొరియా, జపాన్​ మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. 

09:32 November 29

ఈ వారంలో వరుసగా లాభాల్లో కొనసాగిన స్టాక్​ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 158 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్​ 40,971 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయి 12,112కు చేరుకుంది. 

త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు విడుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Nov 29, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details