దేశంలో పెట్రో ధరల బాదుడు (Petrol price hike) ఆగడం లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్పై 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.54కు చేరగా.. డీజిల్ ధర రూ.92.13కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర (Mumbai Diesel Price Today) 29 పైసలు పెరిగి రూ.109.51కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.88 వద్ద కొనసాగుతోంది.
- కోల్కతాలో లీటర్ పెట్రోల్పై (Kolkata Today Diesel Price) 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.104.19కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.95.19గా ఉంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ.100.98 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.96.56గా ఉంది.