తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2021, 3:49 PM IST

ETV Bharat / business

నష్టాలకు బ్రేక్.. సెన్సెక్స్​ 166 ప్లస్

వరుసగా నాలుగు రోజులు నష్టాల్లో ట్రేడ్​ అయిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 166 పాయింట్లు లాభపడి.. 52,480 ఎగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 42 పాయింట్ల లాభంతో.. 15,722 వద్ద స్థిరపడింది.

today stock market
షేర్ మార్కెట్

వరుస నష్టాలను చవిచూసిన స్టాక్​ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వారాంతపు సెషన్​లో.. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 166 పాయింట్లు పుంజుకుని 52,484 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 42 పాయింట్ల లాభంతో 15,722 వద్దకు చేరింది.

ఇన్​ఫ్రా, ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో లాభాలను నమోదు చేశాయి సూచీలు. కాగా, లోహ, విద్యుత్​ రంగ షేర్ల అమ్మకాలు లాభాలను పరిమితం చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,527 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,177 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,738 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 15,635 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ ఎక్కువగా లాభాలను గడించాయి.

టాటా స్టీల్, పవర్​గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, సన్​ఫార్మా ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ సూచీలు లాభాలు నమోదు చేయగా.. కోస్పీ, హాంగ్​ సెంగ్​ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడండి:స్టాక్​ మార్కెట్లో లాభాలు రావాలంటే ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details