తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉల్లంఘన' కేసులో అనిల్​ అంబానీకి ఊరట

రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్ చెల్లించాల్సిన​ బకాయిల అంశంలో... రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ అనిల్​ అంబానీకి ఊరట లభించింది. తమ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ మైనార్టీ వాటాదారులు.. అంబానీతో పాటు ఇతర అధికారులపైనా దాఖలు చేసిన ధిక్కార పిటిషన్​ను కొట్టివేసింది జాతీయ కంపెనీ లా అప్పీలేట్​ ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ)​.

By

Published : Jul 23, 2019, 5:05 PM IST

Updated : Jul 23, 2019, 5:24 PM IST

ఉల్లంఘన కేసులో అనిల్​ అంబానీకి ఊరట

జాతీయ కంపెనీ లా అప్పీలేట్​ ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ) ఎదుట రిలయన్స్​ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది.

రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​.. తమ​ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ కొందరు వాటాదారులు రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ అనిల్​ అంబానీపై, ఇతర అధికారులపైనా ధిక్కార పిటిషన్​ దాఖలు చేశారు. రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​.. రిలయన్స్​ కమ్యూనికేషన్స్​(ఆర్​కామ్​)కు అనుబంధ సంస్థ. ప్రస్తుతం దివాలాలో ఉంది.

ఇద్దరు సభ్యుల ఎన్​సీఎల్​ఏటీ ధర్మాసనం ఈ పిటిషన్​ను కొట్టివేసింది. ధిక్కరణకు సంబంధించిన అంశమేమీ కనిపించనందున కేసు నమోదు చేయలేమని స్పష్టం చేశారు ఎన్​సీఎల్​ఏటీ ఛైర్మన్​ జస్టిస్​ ఎస్​జే ముఖోపాధ్యాయ.

రూ. 230 కోట్ల బకాయిలు...

రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​ తమకు సకాలంలో చెల్లించాల్సిన రూ. 230 కోట్లను కట్టలేదని అప్పీలేట్​ ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది హెచ్​ఎస్​బీసీ డైసీ.

రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​, హెచ్​ఎస్​బీసీ డైసీ ఇంకా ఇతర సంస్థలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అనిల్​ అంబానీ అధీనంలోని సంస్థ ఆరు నెలల్లో ఈ మొత్తం చెల్లించాలని ఎన్​సీఎల్​ఏటీ 2018 జూన్​ 26 నాటి ఆదేశాల్లో స్పష్టం చేసింది.

6 నెలల గడువు ముగిసిన అనంతరం.. రిలయన్స్​ ఇన్​ఫ్రాటెల్​లో 4.26 శాతం వాటా కలిగిన 9 మంది మైనార్టీ వాటాదారులు, హెచ్​ఎస్​బీసీ డైసీ.. ధిక్కార పిటిషన్​ దాఖలు చేశారు.

అయితే ప్రస్తుతం సంస్థ దివాలా ప్రక్రియలో ఉన్నందున చెల్లింపులు సాధ్యం కాదని, పైగా ఐబీసీ నిబంధనల కింద మారటోరియం విధింపు కొనసాగుతోందని ఆర్​కామ్.. ట్రైబ్యునల్​కు తెలిపింది.

Last Updated : Jul 23, 2019, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details