తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 63 ప్లస్ - నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Market LIVE Updates: Indices open in the red with Nifty around 14,750; Airtel, Future group stocks in focus
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 4, 2021, 9:29 AM IST

Updated : Feb 4, 2021, 12:05 PM IST

11:58 February 04

లాభాల్లోకి మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది. ప్రస్తుతం 50,319 వద్ద ట్రేడవుతోంది.  

నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి.. 14,819 పాయింట్ల వద్దకు చేరింది. 

10:34 February 04

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ వంటి హెవీవెయిట్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 

ఓ దశలో 50 వేల మార్క్​ దిగువకు చేరిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 176 పాయింట్ల పతనంతో 50,079 వద్ద కదలాడుతోంది.  

లాభాలు నష్టాలు

సెన్సెక్స్-30 షేర్లలో మహీంద్ర అండ్ మహీంద్ర 5 శాతానికి పైగా ఎగబాకింది. ఓఎన్​జీసీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, సన్​ఫార్మా, ఐటీసీ షేర్లు రాణిస్తున్నాయి. గత రెండు సెషన్లలో గణనీయంగా వృద్ధి చెందిన ఇండస్ఇండ్ షేరు విలువ 2.34 శాతం పడిపోయింది. టైటాన్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే పయనిస్తున్నాయి. టోక్యో, హాంకాంగ్, సియోల్, షాంఘై షేర్ మార్కెట్లలో బేర్ హవా సాగుతోంది.  

ముడి చమురు

మరోవైపు, క్రూడ్ ఆయిల్ ధరలు 0.89 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 58.98 వద్ద ట్రేడవుతోంది.  

09:18 February 04

సెన్సెక్స్ 191 పాయింట్లు పతనం

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్​లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 191 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 50,064 వద్ద కదలాడుతోంది.  

నిఫ్టీ సైతం 48 పాయింట్లు నష్టపోయి.. 14,741 వద్ద ట్రేడవుతోంది.  

సెన్సెక్స్ షేర్లలో ఎం&ఎం, బజాజ్ ఆటో, ఓఎన్​జీసీ షేర్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.

Last Updated : Feb 4, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details