తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బకు 4 రోజుల్లో రూ.19 లక్షల కోట్లు హాంఫట్​ - nse news

కరోనా కారణంగా స్టాక్​ మార్కెట్లు దాదాపు ప్రతి రోజూ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయ మార్కెట్లు ఊహించని రీతిలో నష్టాలను మూటగట్టుకోవటం వల్ల నాలుగు రోజుల్లో సుమారు రూ.19 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది.

Investor wealth
నాలుగు రోజుల్లో రూ.19 లక్షల కోట్లు హాంఫట్​

By

Published : Mar 19, 2020, 7:16 PM IST

అంతర్జాతీయ, దేశీయ స్టాక్​ మార్కెట్లు కరోనా భయంతో కుదేలవుతున్నాయి. సెన్సెక్స్​ భారీగా క్షీణించి 29 వేల దిగువకు చేరుకోగా.. అదే దారిలో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మదుపరులు ఊహించని రీతిలో సంపదను కోల్పోతున్నారు. నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 19.49 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ గురువారం 581 పాయింట్లు కోల్పోయి 28,888 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల్లో 5,815 పాయింట్ల మేర నష్టపోయింది.

30-షేర్​ ఇండెక్స్​ సెన్సెక్స్​ వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను మూటగట్టుకున్న తరుణంలో సంపద రూ.19,49,461.82 కోట్లు ఆవిరైంది. ఫలితంగా మదుపరుల మొత్తం సంపద రూ.1,09,76,781 కోట్లకు తగ్గింది.

ఇదీ చూడండి: అవే భయాలు... మళ్లీ భారీగా నష్టపోయిన మార్కెట్లు

ABOUT THE AUTHOR

...view details