తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2021, 4:26 PM IST

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.297 పెరిగి.. రూ.48,946కు చేరింది.

gold prices hike and silver jumps high in india
స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో మంగళవారం 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.297 పెరిగి.. రూ.48,946కు చేరింది. వెండి ధర మాత్రం భారీగా రూ.1,404 పెరిగి రూ.65,380 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,858 డాలర్లుగా ఉంది. వెండి ధర 25.39 డాలర్లకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి విజృంభణ భయాలతో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ అనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

ఇదీ చదవండి:బ్యాకింగ్ షేర్ల దూకుడు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

ABOUT THE AUTHOR

...view details