తెలంగాణ

telangana

ETV Bharat / business

పెళ్లిళ్ల సీజన్​ డిమాండ్​ - రూ.42 వేలు దాటిన పసిడి - బంగారం రేటు

పసిడి ధరలు నేడు రూ.42 వేల మార్కును చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​ ప్రభావంతో దిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ.462 వృద్ధి నమోదైంది. కిలో వెండి ధర రూ.1,047 పెరిగింది.

gold
బంగారం

By

Published : Feb 19, 2020, 3:59 PM IST

Updated : Mar 1, 2020, 8:37 PM IST

పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.462 పెరిగి 42,339కి చేరుకుంది.

"దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర 42వేల మార్కును దాటింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగిన వేళ దేశంలో రూ.462 పెరుగుదల నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్​ కూడా ధరల పెరుగుదలకు తోడైంది. "

- తపన్ పటేల్​, హెచ్​డీఎఫ్​సీ సెక్యురిటీస్​

వెండి కూడా కిలోకు రూ.1,047 పెరిగి 48,652కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్ బంగారం 1,606 డాలర్లు ఉండగా.. వెండి 18.32గా ఉంది.

Last Updated : Mar 1, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details