తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి పతనం- బంగారం, వెండికి రెక్కలు - వెండి ధరలు

రూపాయి బలహీనపడటం వల్ల బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి వెల రూ.422 పెరిగింది. వెండి కూడా కిలోకు రూ.1,013 పైకెగిసి మళ్లీ 70 వేల మార్కు దాటింది.

gold price
బంగారం

By

Published : Sep 15, 2020, 4:39 PM IST

దేశీయ మార్కెట్​లో పసిడి ధరలు మంగళవారం పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.422 పెరిగి.. రూ.53,019 కు చేరుకుంది.

వెండి కూడా కిలోకు రూ.1,013 పెరిగి రూ.70,743 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ధరల పెరుగుదల, రూపాయి 16 పైసలు బలహీనపడటం వల్ల బంగారం వెల పెరిగిందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ విశ్లేషకుడు తపన్​ పటేల్ వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పసిడి వెల ఔన్సుకు 1,963 డాలర్లు ఉండగా.. వెండి 27.31 డాలర్లకు చేరుకుంది.

ఇదీ చూడండి:మార్కెట్లకు లాభాలు- 11,500 పాయింట్ల ఎగువకు నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details