కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీనితో స్టాక్ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పని చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
- మొహర్రం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లకు సెలవు.
ఆర్థిక అంశాల పరంగా చూస్తే.. సోమవారం టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఈ లెక్కలు మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ సంస్థగత పెట్టుబడులు కూడా దేశీయ మదుపరుల సెంటిమెంట్పై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.
ఇటీవల రికార్డులను తిరగరాస్తూ.. కొత్త గరిష్ఠాలకు చేరిన మార్కెట్ల జోరు ఇంకా కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.