తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన కరోనా భయాలు- భారీ నష్టాల్లో సూచీలు

By

Published : Mar 24, 2021, 9:25 AM IST

Updated : Mar 24, 2021, 3:29 PM IST

Financial and IT stocks are volatile- indicators of losses
ఆర్థిక, ఐటీ షేర్లు కుదేలు- నష్టాల్లో సూచీలు

15:25 March 24

వెంటాడిన కరోనా భయాలు- భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 849 పాయింట్లు నష్టపోయి 49,201 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 262 పాయింట్లు దిగజారి 14,551 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్​ షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ రెండు కంపెనీలే లాభపడ్డాయి.

ఎం అండ్​ ఎం, ఎస్​బీఐ,యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​, ఎల్​ అండ్ టీ, ఐటీసీ, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

10:36 March 24

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లు నష్టపోయి 49,450 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 181 పాయింట్లు దిగజారి 14,633 వద్ద ట్రేడవుతోంది.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద కొనసాగుతోంది.  

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లో కదలాడుతున్నాయి. 

విద్యుత్తు, యుటిలిటీస్‌, హెల్త్‌కేర్‌ మినహా దాదాపు దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.

నష్టాల్లో...  

ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, మారుతి, టెక్​ మహేంద్ర, కోటక్​ మహేంద్ర బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

లాభాల్లో...

ఏషియన్​ పెయింట్స్​, పవర్​ గ్రిడ్​, హిందుస్థాన్​ యూనిలివర్​, సన్​ఫార్మా, డా. రెడ్డీస్​ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

09:12 March 24

లైవ్​ అప్​డేట్స్​: స్టాక్​మార్కెట్​

స్టాక్​మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 302 పాయింట్లు కోల్పోయి 49,748 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 14,724 వద్ద కొనసాగుతోంది.

నష్టాల్లో...  

ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, మారుతి, టెక్​ మహేంద్ర, కోటక్​ మహేంద్ర  షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

లాభాల్లో...

ఏసియన్​ పెయింట్స్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​ గ్రిడ్​, హిందుస్థాన్​ యూనిలివర్​, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

Last Updated : Mar 24, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details