టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జూన్లో భారీగా తగ్గింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్లో డబ్ల్యూపీఐ 1.81 శాతం క్షీణించింది.
ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగినా.. ఇంధన, విద్యుత్ ధరలు తగ్గడం వల్ల ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు తెలుస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం 2020 మేలో టోకు ద్రవ్యోల్బణం 3.21 శాతంగా, గత ఏడాది జూన్లో 2.02 శాతంగా ఉంది.