తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎం-కిసాన్​: బంగాల్​ ప్రభుత్వం వద్దన్నా రైతులు ఆగలేదు - బంగాల్​లో ప్రభుత్వం అంగీకరించకున్నా పీఎం కిసాన్​కు భారీగా దరఖాస్తులు

ప్రధాన్​ మంత్రి కిసాన్​ పథకం కింద బంగాల్​ నుంచి భారీగా దరఖాస్తులు అందినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే బంగాల్​ ప్రభుత్వం వారిని అర్హులుగా గుర్తించని కారణంగా.. ఈ పథకం వల్ల లబ్ధిచేకూరదని పేర్కొంది.

పీఎం-కిసాన్​: బంగాల్​ ప్రభుత్వం ఒద్దన్నా రైతులు ఆగలేదు

By

Published : Oct 9, 2019, 6:01 AM IST

Updated : Oct 9, 2019, 7:00 AM IST

బంగాల్​లో 7,000 నుంచి 8,000 మంది రైతులు ప్రధాన్​మంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి కోసం ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ పథకం అమలు చేసేందుకు బంగాల్ ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఈ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు తోమర్.

అయితే బంగాల్​లో దరఖాస్తు చేసుకున్న​ రైతులకు పీఎం-కిసాన్ పథకం లబ్ధిచేకూరదని తోమర్​ స్పష్టం చేశారు. సమాఖ్య నిబంధనలను కేంద్రం దాటివేయలేదని పేర్కొన్నారు. లబ్ధిపొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న రైతులను అర్హులుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. గతంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని బంగాల్​ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తోమర్ గుర్తు చేశారు.

రూ.87,000 కోట్లతో మూడు విడతలుగా ఏడాదికి రూ.6,000 ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వ్యక్తిగతంగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గత నెల పీఎం కీసాన్ పోర్టల్​నూ ప్రారంభించింది.

ఈ పోర్టల్​ ద్వారా దేశవ్యప్తంగా మొత్తం 3లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకోగా.. బంగాల్​ నుంచి 7 వేల నుంచి 8 వేల దరఖాస్తులు అందాయి.

ఇదీ చూడండి: నానోకు ఇక టాటా... 9 నెలల్లో ఒకే ఒక్క కారు విక్రయం!

Last Updated : Oct 9, 2019, 7:00 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details