తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన జీఎస్​టీ వసూళ్లు- జులైలో రూ.లక్ష కోట్లపైకి

జీఎస్​టీ వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. జులైలో రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 జులైతో పోలిస్తే.. గత నెల జీఎస్​టీ ఆదాయం 33 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

By

Published : Aug 1, 2021, 1:06 PM IST

GST collection Data
జీఎస్​టీ వసూళ్ల లెక్క

జులైలో వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్​ దాటాయి. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,16,393 లక్షల కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. గత ఏడాది జులైతో పోల్చితే ఈ మొత్తం 33 శాతం ఎక్కువని పేర్కొంది.

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ రూ.22,197 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ రూ.28,541 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ రూ.57,864 కోట్లు
  • సెస్​ రూ.815 కోట్లు

ఇదీ చదవండి:4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి

ABOUT THE AUTHOR

...view details