తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'

మోదీ 2.0 ప్రభుత్వ వందరోజుల పాలనలో కేంద్రం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ సుస్థిరాభివృద్ధికై రూ. వంద లక్షల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి టాస్క్​ ఫోర్స్(కార్యదళం) ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్​ రంగం తీవ్ర ప్రభావానికి లోనవుతోందని వ్యాఖ్యానించారు.

By

Published : Sep 11, 2019, 5:37 AM IST

Updated : Sep 30, 2019, 4:45 AM IST

'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'

'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'

వచ్చే ఐదేళ్లలో దేశాన్ని 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్​ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ 2.0 ప్రభుత్వ వందరోజుల పాలనలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

దేశ సుస్థిరాభివృద్ధి కోసం వంద లక్షల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు నిర్మలా పేర్కొన్నారు. ఇందుకు కావలసిన ప్రాజెక్టులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని చేపట్టినట్లు వివరించారు.

'ఆటోమొబైల్​' కొనుగోలు కంటే క్యాబ్​లకే మొగ్గు

18 నెలల కిందట దేశంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని... ప్రస్తుతం ఈ రంగాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఆటోమొబైల్​ వాహనాల కొనుగోలు కంటే ఓలా, ఊబర్​ వంటి క్యాబ్ సర్వీసులవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఆర్థిక మంత్రి. ఫలితంగా ఈ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వ్యాఖ్యానించారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Last Updated : Sep 30, 2019, 4:45 AM IST

ABOUT THE AUTHOR

...view details