ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్ల(ఎస్జీబీ) ఇష్యూ సోమవారం ప్రారంభమైంది. గ్రాము బంగారం ధర రూ.4,842గా నిర్ణయించింది ఆర్బీఐ. 2021 మే 28(శుక్రవారం) వరకు ఇవి సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసే మదుపర్లకు గ్రాముపై రూ.50 రాయితీ లభించనుంది.
ఏమిటి ఈ సార్వభౌమ పసిడి బాండ్లు?
సార్వభౌమ పసిడి బాండ్లు(ఎస్జీబీ) ప్రభుత్వం అందించే బాండ్ల లాంటివే. ప్రభుత్వం తరఫున వీటిని ఆర్బీఐ జారీ చేస్తుంది. ఎస్జీబీలనూ గ్రాముల చొప్పునే తీసుకోవాల్సి ఉంటుంది.
2.5 శాతం రాబడి..
దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతుంటారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్లో ఉన్న బంగారం ధర ప్రకారమే అప్పటి ధర నిర్ణయిస్తారు.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?