తక్షణ నగదు బదిలీ వ్యవస్థ 'రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్' (ఆర్టీజీఎస్) సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
ఆర్టీజీఎస్ వ్యవస్థ అప్గ్రేడ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది. ముఖ్యంగా డిజాస్టర్ రికవరీ టైమ్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.