తెలంగాణ

telangana

ETV Bharat / business

'చిల్లర' పెరిగినా 'టోకు' ద్రవ్యోల్బణం తగ్గింది - Wholesale price based inflation latest news

ఈ ఏడాది అక్టోబర్​లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర గణాంకాలశాఖ వెల్లడించింది. తయారీ రంగ వస్తువులు సహా ఆహారేతర వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని వెల్లడించింది.

'చిల్లర' పెరిగింది.. 'టోకు' ద్రవ్యోల్బణం తగ్గింది

By

Published : Nov 14, 2019, 3:17 PM IST

చిల్లర ధర ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 4.62 శాతానికి పెరిగి 16 నెలల గరిష్ఠానికి చేరినా.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం తగ్గుదలే నమోదుచేసిందని కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. అక్టోబర్‌లో టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. కాస్త తగ్గి 0.16 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఈ సూచీ 0.33 శాతంగా ఉంది. ప్రధానంగా తయారీ రంగ వస్తువులు సహా ఆహారేతర వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని వెల్లడించింది కేంద్ర గణాంకాల శాఖ.

2018 అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. 5.54 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో ఆహార పదార్థాల ధరలు 9.80 శాతం పెరిగితే.. ఆహారేతర వస్తువుల ధరలు 2.35 శాతం ఎగబాకాయి. తయారీ రంగ వస్తువుల ధరలు... 0.84 శాతం తగ్గాయి.

ఇదీ చూడండి : బ్యాంకింగ్​లోకి గూగుల్​... త్వరలో చెకింగ్​ ఖాతా సేవలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details