తెలంగాణ

telangana

అక్టోబర్​లో 4.62 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం

అక్టోబర్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలు దాటి 4.62 శాతంగా నమోదైంది. కేంద్రం తాజాగా వెల్లడించిన ఈ గణాంకాలు.. మాంద్యం భయాలను మరింత పెంచుతున్నాయి.

By

Published : Nov 13, 2019, 6:25 PM IST

Published : Nov 13, 2019, 6:25 PM IST

ద్రవ్యోల్బణఁ

చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్​లో 4.62 శాతానికి పెరిగింది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగటమే ఇందుకు కారణంగా తాజా గణాంకాల్లో ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏడాది సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 3.99 శాతంగా ఉండగా.. గత ఏడాది అక్టోబర్​లో 3.38 శాతంగా నమోదైంది.

ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్​లో 7.89 శాతానికి పెరిగింది. సెప్టెంబర్​లో ఇది 5.11 శాతంగా ఉండటం గమనార్హం.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి మించకుండా చూడాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సారి లక్ష్యాలను దాటి రిటైల్​ ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ద్వైమాసిక సమావేశాల్లో రెపో రేట్లపై రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంటుంది​.

ఇదీ చూడండి: ఇకపై ఫేస్​బుక్​లోనూ ఆన్​లైన్​ చెల్లింపులు!

ABOUT THE AUTHOR

...view details