తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లు తగ్గేనా?.. నేటి నుంచి ఎంపీసీ భేటీ

రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 4న 2019-20లో మొదటి ద్వైమాసిక సమీక్ష నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

By

Published : Apr 2, 2019, 6:06 AM IST

Updated : Apr 2, 2019, 6:43 AM IST

రిజర్వు బ్యాంకు

ఆరుగురు సభ్యుల రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధాన కమిటీ మూడు రోజుల భేటీ నేడు ప్రారంభం కానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈ నెల 4న ఉదయం 11.45 గంటలకు వెలువరించనుంది కమిటీ.

రెపోరేటు లాంటి కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక వేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన క్రితం సమీక్షలో ఎనిమిది నెలల అనంతరం వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. మళ్లీ తగ్గించినట్లయితే ఆర్థిక రుణ స్వీకర్తలకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

వృద్ధిపై ఆందోళనలు ఉండటం సహా ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయిలోనే ఉండటం వల్ల రేట్లను తగ్గించకపోవటానికి ఎలాంటి ప్రధాన కారణాలు ఉండకపోవచ్చు. 25 బేసిస్​ పాయింట్ల కంటే ఎక్కువగా రేట్ల కోతను చేపడుతుందా? లేదా? అన్నదే ఇంకా సమంజసమైన ప్రశ్న అని నా అభిప్రాయం.

- సుజన్​ హజ్రా, ఆనంద్​ రథీ షేర్స్​ అండ్​ స్టాక్​ బ్రోకర్స్​.


ఇదీ చూడండి: మళ్లీ తగ్గనున్న వడ్డీ రేట్లు..!

Last Updated : Apr 2, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details