తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 5:31 PM IST

ETV Bharat / business

మంగళవారం నుంచి ఆర్​బీఐ సమీక్ష- రేట్ల కోత ఖాయం!

కరోనా సంక్షోభం, ఆర్థిక వృద్ధి మందగమనం భయాల నడుమ మంగళవారం ఆర్​బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రారంభం కానుంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయి వద్ద ఉన్న రెపో రేటును ఆర్​బీఐ మళ్లీ తగ్గించొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి రెపో తగ్గింపు ఈ సారి సమీక్షలో సాధ్యమేనా? నిపుణులు ఏమంటున్నారు?

Rbi policy meet
ఆర్​బీఐ విధాన సమీక్ష

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష మంగళవారం ప్రారంభం కానుంది. ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి 6 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ద్వైమాసిక సమీక్షలో అనేక అంశాలపై చర్చ జరగనుంది. 6వ తేదీన వెలువడే సమీక్ష నిర్ణయాల్లో.. రెపో రేటు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..

ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్​బీఐ. కరోనా కారణంగా నగదుకు ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.

రెండు సార్లు వడ్డీ తగ్గింపుతో రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

వీటికి తోడు రుణాల పునర్​వ్యవస్థీకరణ సహా మరిన్ని అంశాలను పరిశీలించమని పరిశ్రమ వర్గాల నుంచి ఆర్​బీఐకి వినతులు వస్తున్నాయి. వీటన్నింటిపై ఎంపీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే ఈ నెల 6వ తేదీ వరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి:నాలుగో నెలా తయారీ రంగం డీలా

ABOUT THE AUTHOR

...view details